అమరావతి : ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL-2024) నిర్వాహకులు విశాఖ క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. రెండు మ్యాచ్లు విశాఖ(Visaka) నగరంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ప్రకారం ప్రకటించిన షెడ్యూల్లో మార్చి 31, ఏప్రిల్ 3న మ్యాచ్లు జరుగుతాయని వెల్లడించారు.
పీఎంపాలెం(PM Palem) లో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 31న దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) -చెన్నై సూపర్కింగ్స్ (Chennai Superkings) , ఏప్రిల్ 3న దిల్లీ క్యాపిటల్స్- కోల్కతా నైట్రైడర్స్(Kolkata Knight Riders) జట్లు ఆడనున్నాయని తెలిపారు. గత ఏడాది నవంబరులో భారత్- ఆస్ట్రేలియా టీ-20, ప్రస్తుతం ఇండియా -ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో భాగంగా రెండో టెస్టు విశాఖపట్నంలో ఇటీవలే జరిగింది.
వరుసగా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నా విశాఖకు చోటు దక్కకపోవడం వల్ల అభిమానులు నిరాశకు గురయ్యారు. నాలుగేళ్ల తరువాత మళ్లీ విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తుండడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో విశాఖకు రెండు మ్యాచ్లు కేటాయించడంతో దిల్లీ క్యాపిటల్స్ కోఓనర్స్ కిరణ్కుమార్, జిందాల్కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.శరత్చంద్రారెడ్డి, ఎస్.ఆర్. గోపీనాథరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.