తిరుమల : తిరుమల ( Tirumala ) క్యూలైన్లో పోగొట్టుకున్న బంగారు గొలుసు ( Gold Chain ) ను సంబంధిత భక్తురాలికి అందజేశారు. డి. కోటేశ్వరరావు అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్తుండగా, ఆయన భార్య ధరించిన బంగారు గొలుసు జారి పడి పోయింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సీవీఎస్వో( చీఫ్ విజిలెన్స్ సెక్యురిటీ ఆఫీసర్) మురళీకృష్ణ ఆదేశాలతో, వీఎస్వోలు రాం కుమార్, సురేంద్ర పర్యవేక్షణలో, ఏవీఎస్ఓ చిరంజీవి, ఆయన బృందం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా సీవీఎస్వో విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతను, త్వరిత స్పందనను అధికారులు ప్రశంసించారు.