తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు సర్వభూపాల వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.మంగళవాయిద్యా లు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. అమ్మవారికి అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వాహనసేవల్లో పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీరాములు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.