ఏలూరు: భీమవరంలో ఉన్న విష్ణు క్యాంపస్లో గో కార్టింగ్ అందుబాటులోకి వచ్చింది. విష్ణు ఏటీవీ, గో కార్ట్ ట్రాకను శనివారం ప్రారంభమైంది. నూతన క్యాంపస్లో రెండెకరాల విస్తీర్ణంలో విద్యార్థుల కోసం గో కార్ట్ ట్రాక్ను ఏర్పాటుచేశారు. ఇక్కడ రెండు రకాల వెహికిల్స్ అందుబాటులో ఉంచారు.
విద్యార్థి దశలో పరిశోధనలు భవిష్యత్లో ప్రగతికి సోపానాలుగా నిలుస్తాయని సియిండియా వెస్టర్న్ సెక్షన్ సీనియర్ డైరెక్టర్, హెడ్ ఎన్.సంజయ్ సుధాకర్ (ముంబై), ఆల్జర్ ఇంజినీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీరాల పాండురంగారావు అన్నారు. విష్ణు క్యాంపస్లో విష్ణు ఏటీవీ, గో కార్ట్ ట్రాక్ను జెండా ఊపి వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయని, కెమికల్ ఇంజినీరింగ్లో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయని, నూతన ఆలోచనలతో సరికొత్త పరిశోధనలు చేయవచ్చునని తెలిపారు. చదువులతో పాటు గో కార్టింగ్ క్రీడల్లో కూడా రాణించేలా విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు.
2015లో విష్ణు క్యాంపస్లో ఆటో మోటిమన్ను ఏర్పాటు చేశామని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీ విష్ణురాజు పేర్కొన్నారు. 2018లో విద్యార్థులకు గో కార్ట్లో పోటీలు నిర్వహించామని, నూతన క్యాంపస్ విద్యా ర్థుల కోసం అన్ని హంగులతో గో కార్ట్ ట్రాక్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. త్వరలో పరిసర ప్రాంతాల విద్యార్థులకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో ప్రతి ఏటా విద్యార్థులకు గో కార్ట్ పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. త్వరలో ఎలక్ట్రికల్ వెహికలను కూడా ఏర్పాటు చేస్తా మని తెలిపారు. అనంతరం మూడో సంవత్సరం మెకానికల్ విద్యార్థులు హన్సిక, సాధ్య, లక్ష్మి, కావ్యలు గో కార్ట్ వెహికిల్స్పై రైడ్ చేశారు. ఈ కార్యక్ర మంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కే ఆదిత్య, విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జీ శ్రీ నివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ పేరిచర్ల శ్రీనివాస్ రాజు, ఏజీఎం రమేష్ రాజుతోపాటు వివిధ శాఖల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.