హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడైన గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసి, కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు గురవారం కోర్టును కోరారు. ఈ కేసులో సీబీఐ అధికారుల విచారణ 101వ రోజుకు చేరింది. నిందితుడు ఉమాశంకర్రెడ్డిని నాలుగురోజుల పాటు సీబీఐ కస్టడీకి పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3 వరకు ఉమాశంకర్రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమాశంకర్రెడ్డికి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.