అమరావతి : ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధకరమని అన్నారు. జూబ్లీహిల్స్లోని మేకపాటి ఇంట్లో గౌతంరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్దాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విధి వైపరీత్యాన్ని ఎవరూ నివారించలేరని ఆయన పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలో గౌతంరెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. వివాదాల జోలికి పోకుండా హుందాగా, సమర్ధవంతం గా పని చేసిన వ్యక్తి మనందరి మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.