అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ సీఈవో గంటా సుబ్బారావు ఈరోజు జైలు నుంచి బెయిల్పై విడుదల అయ్యారు. సుబ్బారావు తరుఫున న్యాయవాద రామకృష్ణ ప్రసాద్ విజయవాడ అవినీతి నిరోదక శాఖా కోర్టులో బెయిల్కు సంబంధించిన జామీను పత్రాలను అందజేశారు. రూ. 2లక్షల పూచీకత్తు సమర్పించిన సుబ్బారావును బెయిల్పై విడుదల చేశారు. కాగా సుబ్బారావును కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు తిరస్కరించింది.
గత టీడీపీ హయాంలో ఏపీలో నిరుద్యోగులకు శిక్షణా పేరిట 234 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ కేసు పలువురిని ఇప్పటికే రిమాండ్కు తరలించింది. ఈ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను అరెస్టు చేసేందుకు వెళ్లగా అనారోగ్యం కారణంగా అతడిని అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.