అమరావతి : ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి (AP CM ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి అని కొనియాడారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే తన గొంతుకగా వినిపించారని పేర్కొన్నారు. మొత్తంగా తెలుగు జాతి గద్దర్కు సెల్యూట్ చేస్తోందని అన్నారు. అతడి కుటుంబ సభ్యులకు అందరూ బాసటగా ఉందామని వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్(74) అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.