AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సు డ్రైవర్, మరో వ్యక్తికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు. గండేపల్లి మండలం రాగంపేట వద్ద గౌహతికి చేపల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు.