అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకరికి, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కొత్త వేరియంట్ను గుర్తించారు యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ కాగా మొత్తం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది.
మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న 334 మందికి కరోనా సోకగా ఇద్దరు చనిపోయారు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య14, 499కు చేరుకుంది.