అమరావతి : డ్రగ్స్, గంజాయితో పట్టుబడ్డ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి గోవాకు డ్రగ్స్ ను తరలిస్తున్న నిందితులను పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పోలీసులు ఓ రిసార్ట్స్ వద్ద డ్రగ్స్తో సహానలుగురిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 7 ఎండీఎంఏ మాత్రలు, 4 ఎండీఎంఏ క్లస్టర్ పౌడర్, 100 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తంగేటి భరత్ అనే వ్యక్తి విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకెళ్లి గోవాలో విక్రయిస్తున్నాడని ఇతనితోపాటు మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.