అమరావతి : ఏపీలోని కడప జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని ముద్దనూరు మండలం చెన్నారెడ్డిపల్లెలో లారీ ఆటోను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి చెందిన దస్తగిరి, సరస్వతి అనే దంపతులతో పాటు ఆటోలో ఉన్న మరో ప్రయాణికుడు మృతి చెందాడు.
జిల్లాలో గువ్వల చెరువు ఘట్రోడ్లో బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అయ్యప్ప స్వాములకు గాయాలయ్యాయి . రాజమహేంద్రవరం నుంచి అయ్యప్ప కొండలకు వెళ్తుండగా బస్సు బోల్తా ప్రమాదం జరిగింది.
అదేవిధంగా విజయనగరంలో జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరంలో ఆర్టీసీ బస్సు ఢీ కొని 12 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బస్సుడ్రైవర్కు ఫిట్స్ రావడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక ఇంటిని బలంగా ఢీకొట్టింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఏడవ తరగతి విద్యార్థి సిరికి అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో 43 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.