అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas cylinder) పేలిపోయింది. దీంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిధిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.