Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఓ కారు అదుపుతప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్గా గుర్తించారు. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్టన్లు సమాచారం.
పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఓ కుటుంబం కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన సరసరావుపేట ఎమ్మెల్యే పీఏను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.