అమరావతి : కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రంలో నాలుగురోజుల క్రితం వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతు అయ్యారు. క్యాంబెల్ నుంచి అంతర్వేదికి వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల వద్ద సెల్ఫోన్లు పనిచేయకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గల్లంతైన మత్స్యకారుల కోసం క్యాంబెల్ పేటకు చెందిన మత్స్యకారులు మరో బోటుతో సహాయంతో సముద్రంలో గాలిస్తున్నారు. కాకినాడ సమీపంలో బోటు మోటారు పనిచేయట్లేదని యజమానికి సమాచారం రావడంతో ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు.