అమరావతి : కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకుల్లో ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
విజయవాడకు చెందిన న్యాయవాది దినేశ్ కుటుంబీకులు ఇటీవల కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం దినేశ్ తల్లి, బాబాయి మృతి చెందారు.
ఈ విషాదం నుంచి కుటుంబీకులు బయటపడకముందే మంగళవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి దినేశ్ తండ్రి కన్నుమూశాడు.
ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతుండగానే మధ్యాహ్నం దినేశ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి