అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ, తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదా (Road accident)ల్లో నలుగురు మృతి చెందారు. కోనసీమ(Konaseema) జిల్లా కొత్తపేట మండటం గంటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనదారుడు మాధవరావు, ఆటో డ్రైవర్ మోసె మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో వారిని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి( Tirupati ) జిల్లా ఏర్పేడు మండలం వికృతిమాల పరిశ్రమ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .