Adulterated Milk | ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీ పాలు తాగడంతో చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో నలుగురు మృతి చెందగా.. 13 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధితులు విలవిలలాడుతున్నారు.
ఒక్కసారిగా రాజమండ్రిలో ప్రజలు అనారోగ్యానికి గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ అనారోగ్యానికి గురవ్వడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అందరూ ఒకే చోట పాలు కొనడంతో కల్తీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ పాలు తాగిన కాలనీల్లో 13 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ డిపార్ట్మెంట్, వైద్యులు, ఆశావర్కర్లు, ఇతర బృందాల ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు
బ్రేకింగ్ న్యూస్
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి
రెండు కాలనీల ప్రజలకు తీవ్ర అస్వస్థత
రాజమండ్రి నగర పరిధిలోని చౌడేశ్వరినగర్లో, వెంకటేశ్వర నగర్లో పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై.. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిలలాడిన బాధితులు
బాధితులను… pic.twitter.com/xkeFCUd5j5
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2026
.