అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట (ఎస్ కోట) నియోజకవర్గం నుంచి గతంలో ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగానూ ఆమె పని చేశారు. పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే పార్టీని వీడతున్నట్లు ఆమె ప్రకటించారు. మరోవైపు ఆమె వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. గత శాసనసభ ఎన్నికల తరువాత ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పూర్తిగా ప్రాబల్యం కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘోర ఓటమి చవిచూసింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీకి గూటికి చేరారు.