అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్నుమూశారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్రాజు(72) పాత నాగూరు నియోజకవర్గం నుంచి 1989-94 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధ పడుతున్నారు. మాజీ మంత్రి, కరుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్రాజు .
వైసీపీలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయన ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు నచ్చక తిరిగి టీడీపీలో చేరారు. శత్రుచర్ల మృతి పట్ల పలు పార్టీకి చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.