అమరావతి : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆయ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా గుంటూరు(Guntur) ) జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నాయకుడు రావెల కిషోర్బాబు (Ravela Kishore Babu) బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటి అయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కిషోర్బాబు మాట్లాడుతూ వైసీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటం చరిత్రాత్మాకమని అన్నారు. గడిచిన ఐదేండ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 2 లక్షల 53 వేల కోట్ల నిధులను పేదల ఖాతాల్లోకి జమ చేసిందని పేర్కొన్నారు. పార్టీ కోసం జగన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఐఆర్టీఎస్ మాజీ అధికారి అయిన రావెల కిషోర్బాబు 2014లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చంద్రబాబు క్యాబినేట్లో మంత్రిగా పనిచేశారు. 2018లో టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఏడాది తరువాత బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక పోయారు.