అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ కన్నుమూశారు. కొవిడ్ తర్వాత అనారోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఆయన తాడికొండ నుంచి 1983, 1985,1999లో టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా పోటి చేసి గెలుపొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఏపీ ఆహార కమిషన్ చైర్మన్గా పనిచేశారు . ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. పుష్పరాజ్ మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.