అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు(Kothapalli Subbarayadu ) జనసేనలో చేరనున్నారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, కమిట్మెంట్కు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1989, 94, 99,2004లో టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) గా గెలుపొందారు.
2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2014లో మళ్లీ టీడీపీలో, 2014లో వైసీపీలో చేరారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో ఇప్పుడు తిరిగి జనసేనలో చేరాలని సుబ్బారాయుడు నిర్ణయించుకున్నారు.