అమరావతి: ఇండియన్ టీమ్ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీస్లో కలిశాడు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై ఈ ఇద్దరూ చర్చించారు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే తాను సపోర్ట్ చేస్తానని కుంబ్లే చెప్పాడు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఓ స్పోర్ట్స్ పరికరాల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా జగన్ను కోరాడు. ఇలాంటి ఫ్యాక్టరీలు మీరట్, జలంధర్లాంటి నగరాల్లో ఉన్నాయని, ఇది రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు.
కుంబ్లే ప్రతిపాదనలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు ఓ ఉన్నతాధికారి పీటీఐకి వెల్లడించారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ గూడ్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఏర్పాటు కోసం త్వరలోనే భూమిని గుర్తిస్తామని కూడా ఆ అధికారి చెప్పారు. ఇండియన్ టీమ్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా ఉన్న కుంబ్లే గతంలో కోచ్గానూ పనిచేశాడు. ప్రస్తుతం ఐసీసీ టెక్నికల్ కమిటీ హెడ్గా కొనసాగుతున్నాడు.