అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో పేయిల్ అయిన విద్యార్థుల పక్షాన మాట్లాడడాన్ని దుయ్యబట్టారు.పదో తరగతి పాస్ కాని పవన్ కల్యాణ్ పేయిల్ అయిన విద్యార్థులపై సానుభూతి చూపడం స్వజాతి లక్షణమని పేర్కొన్నారు.చదువుకుంటే ఎవరైన పాసవుతారని అన్నారు.
పరీక్షా పత్రాలను వైసీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గాని దిద్దారా అని నిలదీశారు. చదువులు చెప్పినా మాస్టర్లే పరీక్షా పత్రాలను దిద్దారని తెలిపారు. దొంగతనంగా పాస్ చేయడానికి అవకాశాలు లేకుండా ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించిందని ఆయన అన్నారు.
పదవ తరగతి ఫలితాలు తగ్గడంపై పవన్ కల్యాణ్ ఇవాళ ఓ పత్రిక ప్రకటనలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవన్ చేసినా వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా పేర్నినాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.