అమరావతి : తెలుగువాడు పింగళి వెంకయ్య (Pingalaji Venkaiah) రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా (National flag ) ప్రతి ఇంటిపై ఎగరడం తెలుగు ప్రజలకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. రేపు 78 స్వాతంత్య్ర దిన్సోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఎక్స్ వేదిక ద్వారా చంద్రబాబు స్పందించారు.
మహోజ్వల చరిత్ర గల భారత దేశ సమగ్రత కాపాడడం అందరి కర్తవ్యం అని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని వెల్లడించారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమని అన్నారు.
ప్రతి ఇళ్లు, ప్రతి కార్యాలయం పై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని, జాతీయ జెండాను మీ సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని సూచించారు. దీని వల్ల మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయి. స్ఫూర్తిని నింపుతాయని సీఎం అన్నారు.
మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయం. మరీ ముఖ్యంగా మన తెలుగు… pic.twitter.com/ErU34cHBKW
— N Chandrababu Naidu (@ncbn) August 14, 2024