శ్రీశైలం : ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయానికి ( Srisailam reservoir) వరద తగ్గుముఖం పడుతుంది. దీంతో జూరాల( Jurala ) , సుంకేశుల( Sunkesula ) ప్రాజెక్టుల నుంచి వరద ఉదృతి తగ్గింది. చేరుతుంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు 10 గేట్లను10 అడుగుల ఎత్తి 2,76,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3,51,433 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,46,944 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,469 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు . ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884 అడుగుల వరకు నీరు ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలకు గాను 210.03 టీఎంసీల నీరు నిలువ ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.