అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్ అశోక్(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం), మధు(తిరుపతి), ఝాన్సీలక్ష్మి(గుంటూరు) .. నాగేంద్ర(విజయనగరం) ఉన్నట్లు తెలిపారు.
గల్లంతైన వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమర్నాథ్ యాత్రికుల వివరాలకు ఏపీ భవన్లో హెల్ప్లైన్ 011-23387089 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.