బాపట్ల: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల బైపాస్ రోడ్డులో జాతీయరహదారిపై ఒంగోలు వైపు నుంచి గుంటూరు సైడు వెళ్తున్న కారు టైరు పంక్చరయింది. దీంతో అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలివైపునకు ఎగిరిపడింది. అదేసమయంలో గుంటూరు వైపు నుంచి ఒంగోళు వైపు వస్తున్న లారీ ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు అద్దంకి ఎస్ఐ సమందరవలి భార్య వహీదా, కుమార్తె అయేషా, జయశ్రీ, దివ్యతేజ, డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు. చిన్న గంజాం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.