శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వరద ఉధృతి గంటగంటకు పెరుగుతూ శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. శుక్రవారం ఉదయం డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర తెరచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,08,918, విద్యుదోత్పత్తి ద్వారా 36,735, సుంకేశుల నుండి 79,268 క్యూసెక్కులు.. మొత్తం కలిపి 2,24,921 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రం వరకు రిజర్వాయర్కు 2,35,874 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా నమోదయింది. అదే విధంగా 5 గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరచి 1,39,915 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదోత్పత్తి కేంద్రం ద్వారా 31,299 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుదోత్పత్తి కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు మొత్తం 2,02,998 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215 టీఏంసీలు కాగా.. ప్రస్తుతం 884.80 అడుగులు, 214.3637 టీఏంసీలుగా ఉన్నాయి. ఏపీ పవర్హౌజ్లో 17.133 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా టీఎస్ పవర్హౌజ్లో 17.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు.