అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ (Omicran) కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి గత నెల 27 ముంబై మీదుగా విశాఖపట్నం వచ్చాడు. ముంబైలో అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కొవిడ్ నెగెటివ్గా వచ్చింది. విశాఖపట్నం చేరుకున్న తర్వాత అధికారులు మరోసారి కరోనా పరీక్ష చేశారు. అందులో పాజిటివ్గా వచ్చింది. ఈ నేపథ్యంలో అతని నమూనాలను అధికారులు హైదరాబాద్లోని సీసీఎంబీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. తాజాగా అందులో ఒమిక్రాన్గా తేలింది.
దీంతో దేంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 17, గుజరాత్లో 9, గుజరాత్లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.