అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడపలో జిల్లాలో ఓ అగ్నిమాపక అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని బద్వేలు అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న ఓబులేసు కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం రాజానగరంలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిబ్బందిని వేధిస్తున్నారన్న ఆరోపణలతో ఓబులేసును ఉన్నతాధికారులు విచారణ జరిపి రెండు నెలల క్రితం సస్పెన్షన్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈరోజు ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తుచేస్తున్నారు.