(Car Fire) విశాఖపట్నంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఏడు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సరైన సమయానికి ఘటనాస్థలికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగలేదు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు.
విశాఖపట్నంలోని ఓ కార్ వర్క్షాప్లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమదం సంభవించింది. ఒక్క ఉదుటున మంటలు చెలరేగాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం షెడ్డులో పార్క్ చేసిన ఏడు కార్లు మంటల్లో చిక్కుకుని బుగ్గయ్యాయి. ఈ ఘటన ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని శ్రీ ఆంజనేయ కార్ కేర్ వర్క్షాప్లో చోటుచేసుకున్నది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే షెడ్డులో ఆస్తి నష్టం రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..