అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆయిల్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు గల్లంతయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఫుడ్స్, ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఐదుగురు కార్మికులకు గాయాలు కాగా వీరిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఒక కార్మికుడు ఆచూకీ లభించక పోవడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.