విశాఖ : విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్కు రంధ్రం పడింది. దీంతో ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి అక్కడే ఉన్న రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఈ ప్రమాదంతో రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.