విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ప్రమాద సంమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా కర్మాగారాన్ని నడుపున్నట్లు వెలుగువచ్చింది. ఇక్కడ క్రూడ్ ఆయిల్ నుంచి గ్రీజ్ను తయారు చేస్తున్నారని స్థానికులు వెల్లడించారు. కాగా, ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని అగ్నిమాపక శాఖ ఏడీ శ్రీనివాసులు పరిశీలించారు.