అమరావతి : ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజా యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీఎం జగన్కు భయం పట్టుకుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మహానాడుకు పోటీగా వైసీపీ మంత్రులు బస్సు యాత్రలు చేపడుతుందని విమర్శించారు. మంత్రులు త్వరలో విమాన యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలకు దొరికితే వెంటబడి కొడతారని వైసీపీ నేతలకు భయం చుట్టుకుందని అందుకే బస్సు యాత్రలు చేపడుతుందని ఆరోపించారు.
బీసీలు టీడీపీ వెంటే ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. పొత్తులు ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమని వెల్లడించారు. జగన్ తండ్రి వైఎస్ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.