అమరావతి : తండ్రీకొడుకులు కలిసి క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. కబడ్డీ శిక్షణకు వస్తున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లాలోని అచ్యుతాపురం పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాపయ్య (50), ఆయన కుమారు నూకలు (27) కలిసి కబడ్డీ శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నారు. దీంతో కబడ్డీ శిక్షణ కోసం పిల్లలు వస్తున్నారు. ఇందులో ఓ ఇద్దరు అమ్మాయిలపై బాపయ్య, నూకలు కన్నేశారు. వారిని ఒంటరిగా నిర్బంధించి అత్యాచారం చేశారు.
తమకు జరిగిన అన్యాయంపై బాధిత అమ్మాయిలు తమ తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాపయ్య, నూకలు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.