అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్చంపేట మండలం చింత పల్లిలో పొలం పనులకు వెళ్లిన తండ్రి, కొడుకుపై పిడుగుపడడంతో తండ్రి మౌలాలి (38) మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ కుమారుడిని స్థానిక రైతులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఏపీలోని రాయలసీమ, చుట్టుపక్కల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వాన కురుస్తుంది. గుంటూరులో ప్రధాన రహదారులు నీటిలో మునిగిపోయాయి.
నంద్యాల, కోవెలకుంట్ల, సంజామల మండలాలను వరద ముంచెత్తింది. ఉన్నట్టుండి కురుస్తోన్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కడప జిల్లా బద్వేల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది.