అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా జోగివారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పంటపొలాలకు కాపాడుకునేందుకు పంట పొలాల్లో నిద్రిస్తున్న రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఒక ఏనుగు ఎల్లప్ప అనే రైతును తొక్కిన సంఘటనలో అతడిని హుటాహుటిన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ చెందాడు.
తమిళనాడు రాష్ట్రంలోని కౌండిన్య అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఎక్కువగా ఉండడంతో అక్కడి అటవిశాఖ అధికారులు ఏనుగులు తరిమివేస్తుండడంతో ఏనుగులు చిత్తూరు జిల్లాకు సమీపంలోని గ్రామాలకు వస్తున్నాయి. దీంతో పంటపొలాలు ధ్వంసం చేస్తున్నాయి. ఇటీవల తిరుమల ఘాట్ రోడ్డు, పాపనాశనం తదితర ప్రాంతాల్లో తరుచూ కనిపిస్తుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.