అమరావతి : తిరుపతి (Tirupati) జిల్లా చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగులు బీభత్సం( Elephants attack) సృష్టించాయి. పంట పొలాలకు కాపాలాగా ఉన్న రైతుల పైన దాడి చేసి గాయపరిచాయి. శేషాచలం అడవుల నుంచి వచ్చిన ఏనుగులు చిన్న రామాపురం పంచాయతీ పరిధిలో ఉన్న యమాలపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఏగుగుల సమూహం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి .
కాపలాగా ఉన్న రైతు(Farmer) మనోహర్ రెడ్డిపైనా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడగా అటవీ శాఖ అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఏనుగుల గుంపు గ్రామాలు, పంటపొలాలపై దాడి చేస్తుండడం పట్ల గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖాధికారులు (Forest Officers) చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.