అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుందని, జగన్ పాలనలో మళ్లీ ఫ్యాక్షనిజం, రౌడీయిజం పెరిగిపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో నిర్వహి స్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడం పిరికిపంద చర్యని పేర్కొన్నారు.
ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ , ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జగన్ ముస్సోలినిని మరిపిస్తున్నారన్నారు. ఇటలీలో ముస్సోలినికి పట్టిన గతే ఏపీలో జగన్కు పట్టబోతుందని వెల్లడించారు. ప్రజల్ని గుప్పిట్లో పెట్టుకుందామన్న నియంతలు, రౌడీలు కాలగర్బంలో కలిసిపోయారని చరిత్ర చెబుతోందని యనమల అన్నారు.
రాష్ట్రంలో పోలీసుల ఏకపక్ష వైఖరి సరికాదని, వైసీపీకి వంతపాడుతున్న పోలీసులకు భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 151 సీట్లు గెలిచామన్న గర్వంతో నియంతృత్వంగా వ్యవహరిస్తున్న జగన్కు వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా దక్కదని అన్నారు.