అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్ర పర్యావరణానికి జరుగుతున్న నష్టం అపారమని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆరోపించారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ట్విటర్ వేదిక ద్వారా స్పందించారు. విధ్వంస పాలనలో కొండలను కొట్టేస్తూ, ఇసుకను దోచేస్తూ జలవనరులను మింగేస్తున్నారని దుయ్యబట్టారు.
గనులను కబళిస్తూ పర్యావరణ వినాశనానికి పాల్పడుతున్న ప్రభుత్వ పెద్దలపై ప్రజలు రణం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. సహజ వనరుల దోపిడితో ప్రకృతికి పాలకులు చేసే హాని అంతా ఇంతా కాదని అన్నారు. పర్యావరణ వేత్తలతో, ప్రకృతి ప్రేమికులతో కలిసి పర్యావరణ విధ్వంసానికి అడ్డుపడదా. రాష్ట్రాన్ని కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.