మద్యం దుకాణాల పనివేళలను పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాత్రి 10 గంటల వరకూ మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చని తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొంది. బేవరేజస్ కార్పొరేషన్ దుకాణాలకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి వుండేవి. ఆ నిడివిని మరో గంట పాటు పొడిగించి, రాత్రి 10 గంటల వరకూ తెరుచుకోవచ్చని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.