AP News | హైదరాబాద్, డిసెంబర్19(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ల చైర్పర్సన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముత్యాలరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే కొంతమంది కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.