అమరావతి : చట్టాలను ఉల్లంఘిస్తూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తూ అటు ప్రజలకు, ఇటు పోలీసులకు ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని నగర బహిష్కరణ( Expulsion)కు గురి చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా రౌడీషీటర్లు(Rowdy Sheeters) నగర బహిష్కరణలో ముందు వరుసలో ఉంటుండడం తెలిసిందే. అయితే విజయవాడలో ఓ మహిళ నగర బహిష్కరణ(Women expulsion)కు గురై పోలీస్ రికార్డులోకి ఎక్కింది.
అసలు ఏం జరిగిందంటే ? . సారమ్మ అనే మహిళ పలుసార్లు గంజాయి విక్రయిస్తూ(Ganja Selling) పోలీసులకు పట్టుబడింది. విజయవాడ నగరం(Vijayawada City)లోని అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో ఆమె పేరుపై 13 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు ఆమెను పోలీసులు కేసులు నమోదు చేసినా, కౌన్సిలింగ్(Councilling) ఇచ్చినా యథావిధిగా ఆమె గంజాయిని సరఫరా, విక్రయించడం చేస్తుంది.
చివరిసారిగా ఆమెను పోలీసులు హెచ్చరించినా ఖాతరు చేయకపోవడంతో ఆమెను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్(Police Comissinor) కాంతిరాణా టాటా వెల్లడించారు. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినా గాని ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వివరించారు. కాగా విజయవాడ పోలీస్ చరిత్రలో మహిళ నగర బహిష్కరణ జరగడం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు.