తిరుమల : తిరుమలలోని అలిపిరి దారిన చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా (Ex-gratia )ను అందజేశారు. గత నెల 11న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకట దినేష్, శశికళ దంపతులు వారి పిల్లలతో కలిసి అలిపిరి (Alipiri ) మార్గంలో తిరుమల(Tirumala)కు బయలు దేరారు.
శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం సమీపంలో ఒక్కసారిగా చిరుత (Leapard) వెంకట దినేష్, శశికళ దంపతుల కూతురు లక్షితపై దాడిచేసి నోట కరుచుకుని అటవి సమీపంలోకి పారిపోయింది. అనంతరం అటవీ అధికారుల గాలింపులో పాప శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
ముందుగా ప్రకటించినట్లుగా లక్షిత తల్లిదండ్రులకు టీటీడీ నుంచి రూ.5 లక్షలు, ఏపీ అటవీశాఖ నుంచి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసులు, తిరుపతి డిఎఫ్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.