అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభాను అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలనే సానుభూతి కోసమే చంద్రబాబు చేతులు అడ్డం పెట్టుకుని ఏడ్వడం పై ఎవరూ బాధ పడలేదు సిగ్గు పడ్డారని వ్యాఖ్యనించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటు వంటి వ్యక్తి ఎంతో ధైర్యంగా ఉండాల్సింది పోయి రాష్ట్రంలో, దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు ఏడ్చారని విమర్శించారు.
రాజకీయ నాయకులకు అనేక రకాలైన అవమానాలు, పొగడ్తలు, నిందలు మాములుగా ఉండాలే తప్పా ..పిరికి వాడిలాగా ఏడ్వడం సిగ్గుచేటని అన్నారు. కొడాలి నాని, వంశీ, అంబటిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చేస్తూ ఊరుకోబోమని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆయన హెచ్చరించారు.కులపరమైన కార్యక్రమాల్లో వారి కష్టనష్టాలు చెప్పుకోవాలి కానీ.. రాజకీయ వ్యాఖ్యలు చేయటం సరికాదని సూచించారు.