అమరావతి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారం నాటి సీఎం చంద్రబాబు కూడా కొనుగోలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి, సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్యచౌదరి, పార్థసారథి అమర్నాథ్, మేరుగ నాగార్జున, మద్దాలి గిరిధర్ను నియమించింది. కొద్ది రోజుల క్రితం బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జి మాట్లాడు తూ పెగాసస్ సాఫ్ట్వేర్ను ఏపీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారని వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో దుమారం రేపింది.
నాటి టీడీపీ ప్రభుత్వం పెగాసస్ను కొనుగోలు చేసిందా. చేస్తే ఎప్పుడు చేసింది. దీంతో ఎలాంటి చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ తేల్చనుంది. అయితే ఈ విషయంపై టీడీపీ నాయకులు గతంలోనే ఖండించారు.