తిరుమల : తిరుమలలోని అన్నప్రసాదం కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న నూతన పరకామణి భవనాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్తో కలిసి తనిఖీ చేశారు. ఈ భవనాన్ని ఈనెల 28న ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ప్రారంభించనున్నారు. పద్మావతి విశ్రాంతి భవనంలో రూ.4 కోట్లతో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఈవో పరిశీలించారు. ఇక్కడి భోజనశాలలో దాదాపు 150 మంది భోజనం చేసేలా అభివృద్ధి చేస్తున్నారు.
ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఈఈలు జగన్మోహన్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, డీఈ రవిశంకర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు వెంకటయ్య, సెల్వం, వీజీవో బాలిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.